అసెంబ్లీ సీట్లు కేటాయింపు పై విజయశాంతి సంచలన పోస్ట్

-

అసెంబ్లీ సీట్లు కేటాయింపు పై బిజేపి నేత విజయశాంతి సంచలన పోస్ట్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం నుండి బీసీలకు, జన సంఖ్యానుసారం 50 కి పైగా 60 వరకు కూడా స్థానాలలో పోటీ చేసి గెలిచే అర్హత, అవకాశాలు ఉన్నాయనేది ఎవరైనా కాదనలేని వాస్తవం అన్నారు విజయశాంతి.

బీసీ లకు టిక్కెట్ కేటాయింపు అంశంలో బీఆర్ఎస్ కనీస ధర్మం కూడా పాటించక మోసగించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ తెలంగాణాలోని మిగతా అన్నీ రాజకీయ పార్టీలు పరిగణనకు తీసుకుని బీసీలకు న్యాయం చేయవల్సిన నిర్ణయం యొక్క అవసరం కనబడుతుందని వెల్లడించారు. ఇక జనాభాలో 50 శాతం పైన ఉన్న మహిళలకు అసలు ఏ పార్టీ ఏమి చేస్తున్నదో… బీఆర్ఎస్ పార్టీ మహిళలను అసెంబ్లీ కి ఎంపిక చేసే విషయంలో చూపిన వివక్షను సరిచేసి చూపవలసిన బాధ్యత అందరికీ ఉన్నదని చెప్పారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version