గవర్నర్ తమిళిసై ని కలిసిన విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ

-

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ని కలిశారు విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా నగరంలో చోటుచేసుకున్న పరిణామాలపై గవర్నర్కు ఫిర్యాదు వైసిపి. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ.. కావాలనే ఉద్వేశాలనుు రెచ్చగొడుతున్నారని.. అమాయకులను చిత్రహింసలు పెడుతున్నారని గవర్నర్ కి తెలిపామని అన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పాలిస్తుంటే.. ఇక్కడ మాత్రం ఎంఐఎం పాలిస్తోందని అన్నారు.

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రానికి ఉన్నది ఉన్నట్టుగా నివేదిక ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. హైదరాబాదులో మునావర్ షో అవసరమా ? అంటూ ప్రశ్నించారు. ఈ షో కోసం 4 వేల మంది పోలీసులతో భద్రత అవసరమా? అన్నారు. మతోన్మాద శక్తులు నగరాన్ని నాశనం చేస్తున్నాయని… మైనారిటీలను ఉసిగొలిపి పబ్బం కడుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గణేష్ ఉత్సవాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోటినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version