సాగర్‌ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత

-

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేసింది. ఈ సమాచారాన్ని కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి అందజేసింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీకి బోర్డు సభ్యుడు బీఆర్‌ శంఖ్వా లేఖ రాశారు. ఈ నెల 12వ తేదీన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లుగా ఆ రోజు నుంచి 23వ తేదీ రాత్రి 8 గంటల వరకు కుడి కాలువ ద్వారా ఏపీకి 5.50 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొంది.

కృష్ణా నది యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ శివ్‌నందన్‌ కుమార్‌తో రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా మంగళవారం రోజున సమావేశం కాగా.. బోర్డుకు ఇవ్వాల్సిన బడ్జెట్‌ను వెంటనే కేటాయించాలని ఛైర్మన్‌ కోరినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు వచ్చిన నదుల అనుసంధాన ప్రాజెక్టు టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్‌ వెదిరె శ్రీరాంతోనూ రాహుల్‌ బొజ్జా భేటీ అయి.. గోదావరిపై సమ్మక్క బ్యారేజీ, సీతారామా ఎత్తిపోతల పథకం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుల అనుమతులు వేగంగా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news