పిల్లలను కొట్టడంతో భర్తను చంపినా భార్య..!

-

మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య చేతిలో హత్య కు గురయ్యాడు భర్త. కుటుంబ కలహాలతో భర్తను హత్య చేసింది భార్య. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. అస్సాంకు చెందిన రుక్సానా అనే 35 ఏళ్ళ అమ్మాయి భర్తతో కలిసి హఫీజ్ పేట్ ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటుంది. అక్కడే కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు భార్యా భర్తలు ఇద్దరు.

కానీ రోజు తాగి వచ్చి భార్యను వేధిస్తుండేవాడు భర్త. రోజు వాటిని సహించిన రుక్సనా.. ఓ రోజు తాగి వచ్చి పిల్లలను కొట్టడంతో భర్తతో విసిగిపోయింది భార్య రుక్సనా. బుధవారం పిల్లలపై ఏకంగా కత్తితో దాడికి ప్రయత్నించాడు భర్త. అప్పుడు భార్య తీవ్రంగా ప్రతిఘటించడంతో భర్త తలకు తీవ్ర గాయం అయ్యి రక్త స్రావంతో అతను మృతి చెందాడు. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. భార్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మియాపూర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version