గొంతు కోసి.. కాళ్లు కట్ చేసి.. మహిళ దారుణ హత్య

-

రాష్ట్రంలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఓవైపు అత్యాచారాలు.. మరోవైపు హత్యలు.. ఇలా కీచకుల చేతుల్లో మహిళల ప్రాణాలు బలైపోతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ దారుణ ఘటన జరిగింది.

స్థానికల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిని గజ్వేల్‌ ఏసీపీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళను వెంకటమ్మ (40)గా గుర్తించారు. వెంకటమ్మ ప్లాస్టిక్‌ సామగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తుండగా.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటమ్మ భర్త గతంలో మృతి చెందారు. కాగా, వెంకటమ్మను హత్య చేసిందెవరు? హత్యకు గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వెంకటమ్మ మరణంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఆమె హత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news