కామారెడ్డిలో వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి

-

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో వృద్ధురాలు మృతి చెందింది. మాచారెడ్డి మండలం లచ్చాపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట కూర్చున్న రామవ్వ(60) అనే వృద్ధురాలిపై అటుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా గుంపుగా దాడి చేశాయి.

ముఖ భాగంపై తీవ్రంగా కరిచాయి. లాక్కెళ్లి మరీ దాడికి తెగబడ్డాయి. కుక్కల దాడిలో ప్రాణాలతో పోరాడుతూ వృద్ధురాలు చావు కేకలు పెట్టడంతో ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వీధి కుక్కలను తరిమికొట్టి వృద్ధురాలిని నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రామవ్వ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ వీధిలో కుక్కలు పిల్లలపైనా దాడి చేస్తున్నాయని బయటకు వెళ్లాలంటే భయంగా ఉందంటూ కాలనీ వాసులు వాపోయారు. అధికారులకు ఫిర్యాదు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల చేతిలో కుక్క చావు చావకుండా తమను కాపాడాలని, చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news