సినిమా ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు అర్ధరాత్రి OTTలోకి కొత్త మూవీలు

-

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరుకారం’తో పాటు ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలు ఈరోజు అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్ఫ్లిక్స్ లో ‘గుంటూరు కారం’ అమెజాన్, ప్రైమ్ లో ‘కెప్టెన్ మిల్లర్’ మూవీని చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీలు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

OTT Telugu Movies releasing Today

కాగా, మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించగా రమ్యకృష్ణ, జయరాం,మురళి శర్మ, ప్రకాష్ రాజ్, ఈశ్వరరావు,వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news