అదుపుతప్పి వాగులో పడ్డ బైక్.. కుమారుడితో సహా మహిళ గల్లంతు

-

ఆస్పత్రికి వెళ్లి తన భార్యా కుమారుడితో ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ కుటుంబం అదుపుతప్పి వాగులో పడింది. వెంటనే తేరుకున్న భర్త ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. కానీ ఆ వాగు ప్రవాహంలో తన భార్య, మూడేళ్ల కుమారుడు గల్లంతయ్యారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలోని పరకాల మండలం వెల్లంపల్లి- నర్సక్కపల్లి మధ్య ఉన్న వాగు వద్ద చోటుచేసుకుంది.

హనుమకొండ జిల్లా నడికూడా మండలం నర్సక్క పల్లి గ్రామానికి చెందిన తూర్పాటి రమేశ్ .. గర్భంతో ఉన్న తన భార్య రాజేశ్వరి తో పాటు మూడు సంవత్సరాల కొడుకు చోటుతో హనుమకొండలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో చీకటి పడింది. మరి కాసేపట్లో ఇంటికి చేరబోతున్న సమయంలో.. వెల్లంపల్లి- నర్సక్కపల్లి మధ్య ఉన్న వాగు వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వాగులో వాహనంతో సహా పడిపోయడు. తన భార్య కొడుకును కాపాడే ప్రయత్నం చేసినా వాళ్లు వాగు ప్రవాహంలో గల్లంతయ్యారని భర్త రమేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గల్లంతైన వారికోసం వెతుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news