టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 తుది కీ విడుదల

-

గ్రూప్‌-4 తుది ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ  తాజాగా విడుదల చేసింది . పేపర్-1 జనరల్​ స్టడీస్​లో ఏడు ప్రశ్నలు తొలగించగా.. మరో ఎనిమిదింటికి ఆప్షన్ మార్చినట్లు తెలిపింది. పేపర్-2 లో రెండు ప్రశ్నలు తొలగించగా.. అయిదింటికి సమాధానాలు మార్చారు. ఆగస్టు 28వ తేదీన ప్రాథమిక ‘కీ’ విడుదల చేసిన టీఎస్​పీఎస్సీ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి.. అభ్యంతరాలపై నిపుణుల సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని మార్పులు, చేర్పులతో తుది ‘కీ’ విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, వార్డు ఆఫీసర్, జూనియర్ ఆడిటర్ తదితర 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి జులై 1న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-4 పరీక్షకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డు స్థాయిలో 9 లక్షల 51 వేల 321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2 వేల 878 పరీక్ష కేంద్రాల్లో 7 లక్షల 60వేల మంది పరీక్ష రాశారు. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడ్డారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.

Read more RELATED
Recommended to you

Latest news