ప్రజల కళ్లల్లో రక్తాన్ని చూస్తుండ్రు.. హైడ్రా కూల్చివేతలపై దాసోజు శ్రవణ్ ఆగ్రహం..!

-

హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం కూకట్ పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో పటేల్ గూడ గ్రామంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రజాస్వామిక రాష్ట్రం రాజ్యాంగబద్దంగా పని చేయాలన్నారు.

సీఎం తన నిరంకుశత్వంతో, మూర్ఖత్వంతో కురచ మనస్తత్వంతో నిస్సహాయులైన ప్రజల కళ్లలో రక్తాన్ని చూస్తుండని విమర్శించారు. ప్రజలు కష్టాలు కడతేర్చమని అధికారమిస్తే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రేవంత్ ప్రభుత్వ వైఖరీ ముమ్మారికి రాక్షసత్వమేనని పేర్కొన్నారు. దురదృష్టం, వాళ్ల, వాళ్ల అధికారం అధికారం కోసం, ప్రాబల్యం కోసం సీఎం చేతిలో కీలుబొమ్మగా ఆయన చేపడుతున్న రాజ్యాంగ వ్యతిరేక విధ్వంసక చర్యలకు హైడ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.  

Read more RELATED
Recommended to you

Exit mobile version