హైదరాబాద్ లోని మాదాపూర్ లో యువకుడు దారుణ హత్య జరిగింది. మాదాపూర్ యశోద ఆస్పత్రి వెనుక తన తల్లి బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాడు జయంత్ గౌడ్ అనే యువకుడు. స్నేహితులతో కలిసి మందు తాగుతుండగా బంగారం, డబ్బులు ఇవ్వాలని బెదిరించారు ముగ్గురు దుండగులు.

ఈ తరుణంలోనే గొడవకు దిగిన జయంత్ గౌడ్ పై కత్తులతో దాడి జరిగింది. దుండగుల దాడిలో అక్కడికక్కడే మృతి చెందాడు యువకుడు. మాదాపూర్లో యువకుడు దారుణ హత్య జరిగిన తరుణంలో గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. హోం మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్లో రోజురోజుకి గాడితప్పుతున్న లా అండ్ ఆర్డర్ అంటూ విమర్శలు చేస్తున్నారు.