ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి హీరో రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఒక్కసారి జనాల్లోకి వస్తే… ఎగబడి చూసేందుకు జనాలు వస్తారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడిపోయినప్పటికీ కూడా ఆయన ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. కూటమి వైఫల్యాలను నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి మరింత ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఓ అభిమాని కీలక నిర్ణయం తీసుకున్నాడు.

జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో వీరాభిమాని అరగుండు గీయించుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ఉనగట్ల కు సంబంధించిన వీరవల్లి శివరామకృష్ణ అలియాస్ శివ… అనే వ్యక్తి 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే తాను అరగుండు గీయించుకుంటానని… చాలెంజ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుల ముందు ఛాలెంజ్ ఓడిపోయిన శివ… జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అభిమానంతో అరగుండు గీయించుకున్నట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.