తెలుగు స్క్రైబ్ గౌతమ్ అరెస్ట్ అయ్యాడు. అర్థరాత్రి 2 గంటలకు నాలుగు వాహనాల్లో ఇంటికొచ్చి తెలుగు స్క్రైబ్ గౌతమ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు టాస్క్ ఫోర్స్ మరియు ఉప్పల్ పోలీసులు. ఎందుకు అరెస్ట్ చేశారో గౌతమ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా తీసుకెళ్లారు పోలీసులు. ప్రస్తుతం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు సమాచారం.

ఇక తెలుగు స్క్రైబ్ గౌతమ్ అరెస్ట్ పై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. అర్థరాత్రి వెళ్ళి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ అక్రమాలను, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేసి కేసులు పెడతారా? అని ఫైర్ అయ్యారు. ఇది పూర్తి అప్రజాస్వామిక చర్య. ప్రజా పాలన అంటే ఇదేనా? అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహించారు. అక్రమంగా అరెస్టు చేసిన గౌతమ్ ను తెలంగాణ డీజీపీ వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు.
అర్థరాత్రి వెళ్ళి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రభుత్వ అక్రమాలను, ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని ప్రశ్నిస్తే టార్గెట్ చేసి కేసులు పెడతారా?
ఇది పూర్తి అప్రజాస్వామిక చర్య.
ప్రజా పాలన అంటే ఇదేనా?… https://t.co/caCInlXeWl— Harish Rao Thanneeru (@BRSHarish) June 1, 2025