రాప్తాడు లోనే జగన్ హత్యకు కుట్ర చేశారు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

-

రాప్తాడు లోనే జగన్ హత్యకు కుట్ర చేశారు అని పేర్కొన్నారు వైసీపీ పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కాపులకు పవన్ వెన్నుపోటు.. పవన్ కు చంద్రబాబు వెన్నుపోటు… ఇక శాశ్వత సమాధికి సిద్ధం అవ్వండి అని ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ అంటే ఏదో మగతనం అనుకుంటున్నావా? జగనన్న మా చేతులు కట్టేసాడు లేదంటే..చుక్కలు చూపించేవాళ్ళం అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాస్ కౌంటర్ ఇచ్చారు.

Thopudurthi Prakash Reddy, JAGAN , AP
Thopudurthi Prakash Reddy, JAGAN , AP

 

నారా లోకేష్… ఇదేమైనా రాష్ట్ర సమస్యా? జాతీయ సమస్యా?. అంతగా ఓవర్‌ రియాక్ట్ అవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. లా అండ్‌ ఆర్డర్ రోజురోజుకీ దిగజారిపోతోంది. కనీస మద్దతు ధరలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేసింది. రైతు భరోసా కింద మీరు ఇస్తామన్న రూ.20వేలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది పెండింగ్ పెట్టిన రూ.20వేలు బకాయి కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news