సూర్యాపేటలో మ‌హిళ‌ను న‌గ్నంగా తిప్పుతూ..క‌ళ్ల‌లో కారం..!

-

సూర్యాపేట‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి వీధుల్లో తిప్పుతూ కొట్టారు. సూర్యాపేట జిల్లా రాజునాయ‌క్ తాండాలో జూన్ 13న శంక‌ర్ నాయ‌క్ అనే వ్య‌క్తి హ‌త్య‌కు గుర‌య్యాడు. దాంతో పోలీసులు ఓ మ‌హిళ‌పై అనుమానంతో పోలీస్ స్టేష‌న్ తీసుకువెళ్లి విచారించారు. అనంత‌రం వ‌దిలిపెట్టారు. కాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌హిళ‌పై రాజు నాయ‌క్ కుటుంబ స‌భ్యులు దాడికి దిగారు.

మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి న‌గ్నంగా వీధుల్లో తిప్పారు. అంతే కాకుండా ప‌ది మంది క‌ర్ర‌ల‌తో కొడుతూ దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. దాంతో ఆ గ్రామ ఎంపీటీసీ శాంతాబాయి మ‌హిళ‌కు దుస్తులు అందించి ర‌క్షించింది. స్థానికంగా ఈ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. బాధితులి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. నింధితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version