BREAKING : బండి సంజయ్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్

-

కరీంనగర్ జిల్లా బండి సంజయ్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకూ నిరసన దీక్షకు ఏర్పాట్లు చేశారు బిజేపి నాయకులు. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి భారీగా తరలివస్తున్నాయి బీజేపీ శ్రేణులు. బండి సంజయ్ ఇంటికి నలువైపులా పోలీసులు మెహరించారు.

అటు ప్రజా సంగ్రామ యాత్ర పై సస్పెన్స్ కొనసాగుతొంది. సంగ్రామ యాత్ర పై కోర్టులో లంచ్ పిటిషన్ దాఖలు చేయనుంది బీజేపీ పార్టీ. కోర్టు ఆదేశాల పై ఉత్కంఠత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాల్లో అరెస్టులు,నిర్బందాలపై నిరసన దీక్షలు చేస్తున్నారు బిజేపి పార్టీ నాయకులు. సంగ్రామ యాత్ర నిలుపుదల సంజయ్ అరెస్ట్ పై బండి సంజయ్ తో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఇక దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version