తాడిపత్రిలో 144 సెక్షన్.. నివురుగప్పిన నిప్పులా పరిస్థితి !

-

అనంతపురం జిల్లా తాడిపత్రి లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. నిన్న రాళ్ళు రువ్వుకున్న ఇరువర్గాలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. పెద్దారెడ్డి అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తన ఇంటి మీదకు దాడి కి వచ్చారని పెద్ద రెడ్డి మీద ఆరోపణలు చేసిన జేసి ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి సి సి ఫుటేజ్ అలాగే వీడియోలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయని నేపథ్యంలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాడిపత్రి నగరం అంతా పోలీస్ యాక్ట్ 30 అమలులోకి తెచ్చారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version