ఏపీలో చదువుకునే పిల్లల తల్లులకు గుడ్ న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘తల్లికి వందనం’ నిధులను వచ్చే నెల జూన్ 19వ తేదీన విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మెగా పీటీఎం (పేరెంట్ టీచర్ మీటింగ్) కూడా నిర్వహించనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలను పెంచడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు: ఈ పథకం కింద ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందుతుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం.. ఒకే కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటున్నా సరే, అందరికీ తలో 15 వేల చొప్పున ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇక కొత్తగా స్కూళ్లలో చేరిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.

డేటా వెరిఫికేషన్ తప్పనిసరి: తల్లికి వందనం డబ్బులు అకౌంట్లో పడాలంటే సచివాలయ హౌస్హోల్డ్ డేటాబేస్తో విద్యార్థి, తల్లి వివరాలను సరిపోల్చే ‘డేటా వెరిఫికేషన్’ ప్రక్రియ పూర్తి కావాలి. గ్రామ లేదా వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ వెరిఫికేషన్ను నవశకం పోర్టల్ ద్వారా పూర్తి చేస్తారు. ఇక ఇందులో మీ వివరాలు కరెక్ట్గా ఉంటేనే డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా జమ అవుతాయి.
తప్పులు ఉంటే ఇలా సరిచేసుకోండి: ఒకవేళ తల్లి వివరాలు డేటాబేస్లో లేకపోతే వెంటనే చేర్పించాలి లేదా తండ్రి వివరాలు ఇవ్వాలి. తల్లి, విద్యార్థి వేర్వేరు కుటుంబ ఐడీల్లో ఉంటే ‘మైగ్రేషన్’ ఆప్షన్ ద్వారా ఒకే చోటికి తీసుకురావచ్చు. ఇక అలాగే ఒకే తల్లికి నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా, ఇద్దరికీ ఒకే ఐడీ నంబర్ ఉన్నా.. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి తప్పులను సరిచేస్తారు.
పిల్లల చదువుల కోసం ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ఎంతోమంది తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తోంది. జూన్ 19న నిధులు విడుదల కానున్నందున, లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వెంటనే తమ సచివాలయానికి వెళ్లి డేటా వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. ఇక దీనివల్ల లాస్ట్ మినిట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి.
గమనిక: లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు మరియు స్కూల్ అడ్మిషన్ డేటాను సచివాలయ రికార్డులతో లింక్ అయి ఉన్నాయో లేదో ముందే సరిచూసుకోవడం ఉత్తమం.
