స్పైవేర్‌ను నా ఫోన్‌కి కూడా పంపినందుకు ధన్యవాదాలు మోడీ జీ :ఎంపీ కేసీ వేణుగోపాల్

-

ప్రధాని మోడీపై , కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ తనకు ఇష్టమైన స్పైవేర్‌ను తన ఫోన్‌కు పంపారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 

ఇటీవల కేసి వేణుగోపాల్ తన యాపిల్ ఫోన్‌కు “స్పైవేర్ దాడి” గురించి హెచ్చరిస్తూ నోటిఫికేషన్ అందుకున్నారు. ఈ క్రమంలో దానికి తాలుకూ ఫొటోను ఎక్స్(ట్విట్టర్) లో షేర్ చేస్తూ, మీకు ఇష్టమైన హానికరమైన స్పైవేర్‌ను నా ఫోన్‌కి కూడా పంపినందుకు ధన్యవాదాలు ప్రధాని మోడీ జీ, యాపిల్ దయ చూపి మీ ఈ ప్రత్యేక బహుమతి గురించి నాకు తెలియజేసిందని అని ఆయన పోస్ట్‌లో రాశారు. మోడీ ప్రభుత్వం నేర పూరితంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది, రాజకీయ ప్రత్యర్థుల వెంట పడి వారి వారి వ్యక్తిగతంలోకి ప్రవేశించేలా వ్యవహరిస్తోంది అని మండిపడ్డారు.ప్రతిపక్షం ఈ రాజ్యాంగ విరుద్ధమైన చర్యను వ్యతిరేకిస్తుంది, అధికార బీజేపీ గోప్యత నిబంధలను ఉల్లంఘిస్తుందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు .బీజేపీ ఫాసిస్టు విధానాలతో రాజ్యంగంపై దాడి చేయడాన్ని ప్రజలు తిరస్కరిస్తారన్నది లోక్‌సభ ఎన్నికల సందేశం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news