ఆయన వలన నా ఒళ్లు హూనమయింది : హీరో రామ్ షాకింగ్ కామెంట్స్….!!

-

యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఇటీవల కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక సతమతం అయిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా అద్భుత విజయాన్ని అందుకుని రామ్ కు మంచి బ్రేక్ ని ఇచ్చింది. అతి త్వరలో ఆ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ పేరుతో మరొక సినిమా కూడా తెరకెక్కనున్నట్లు ఇటీవల పూరి తెలిపారు. ఇకపోతే ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ ‘రెడ్’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు.

‘తడం’ అనే తమిళ సస్పెన్స్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా రామ్ తొలిసారిగా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. కొద్దిరోజుల నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా స్పాట్ నుండి రామ్ కాసేపటి క్రితం ఒక వీడియో ని విడుదల చేసారు. ఆ వీడియోలో తన ఒంటికి తగిలిన గాయాలను షర్ట్ విప్పి మరీ చూపించిన రామ్, తనను ఈ సినిమా ఫస్ట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఎంతో కష్టపెడుతున్నారని, అయితే తనకు అదే చాలా ఇష్టం అని, ఎందుకంటే ఎంతో కష్టపడితేనే సక్సెస్ వస్తుందని, తన ఒంటికి అయిన గాయాలను చూపిస్తూ, మీకు కృతజ్ఞతలు పీటర్ హెయిన్స్ గారు అంటూ వీడియో ని పోస్ట్ చేసాడు.

 

స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ మాదిరిగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని, తమిళ సినిమాలోని మెయిన్ పాయింట్ ని మాత్రమే తీసుకుని, పూర్తిగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కమర్షియల్ పంథాలో దర్శకుడు కిశోర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ సినిమా ఓపెనింగ్ సందర్భంగా హీరో రామ్ తెలిపారు…..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version