ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని… విద్యార్థులకు బిగ్ అలర్ట్. వారందరికీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగ్రికల్చర్, పశు వైద్య విద్యార్థుల స్కాలర్షిప్ కూడా ₹7,000 నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరిగింది. ఇందులో పీజీ విద్యార్థులకు 12 వేల రూపాయలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం.
అలాగే… వ్యవసాయ ఉద్యాన వెటర్నరీ యూనివర్సిటీలలో… ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి రిటైర్మెంట్ వయస్సును… 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అంతేకాదు సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రోత్సాహాలు ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యాదవ కురబలకు బిసి కార్పొరేషన్ ద్వారా గొర్రెలు అలాగే మేకలు.. పంపిణీ చేయాలని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు.