కూతురు మృతదేహాన్ని ఐదు రోజులుగా ఇంట్లోనే ఉంచి తల్లిదండ్రుల క్షుద్రపూజలు

-

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్రాజ్ లోని కర్చన ప్రాంతం దిగా గ్రామానికి చెందిన అంతిమ యాదవ్(18) ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బయటకి పొక్కనీయలేదు. ఇంట్లో గడియ పెట్టుకుని ఆమెను బతికించేందుకు ఓ మంత్రికుడితో కలిసి క్షుద్ర పూజలు చేయించారు. ఐదు రోజులుగా మృతదేహం అలానే ఉండడంతో కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. దీన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే వచ్చిన పోలీసులు ఇంటిలోపలకు వెళ్లి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజులుగా ఆ కుటుంబీకులు ఏమీ తినకుండా గంగాజలం తాగుతూ క్షుద్రపూజలతో పాల్గొన్నట్లు సమాచారం. ఏమి తినకపోవడం, దుర్వాసన కారణంగా ఇంట్లోని మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వారి మానసిక పరిస్థితిని బట్టి తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version