‘గుడ్డు’ పగిలింది.. గాజువాకలో మంత్రి అమర్నాథ్ ఓటమి

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి భారీ ఓటమి కొనసాగుతుంది. కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

మంత్రి అమర్నాథ్ గాజువాకలో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన అమర్నాథ్ ఈసారి గాజువాక నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. కాగా, ఏపీకి పెట్టుబడుల విషయంలో అమర్నాథ్ చేసిన ‘కోడిగుడ్డు’ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ‘గుడ్డు’ పగిలింది అంటూ నెటిజన్లు నెట్టింట్లా సెటైర్లు వేస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు, జనసేన పార్టీ 2 స్థానాలు, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించగా వైసిపి పార్టీ ఇప్పటికీ కూడా ఇంకా ఖాతా తెరవలేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news