మంత్రి రోజా పై వరుస ట్వీట్లతో విరుచుకుపడిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

-

ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా మంత్రి రోజా పై, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రోజా ఆంటీ అరంగుళం మేకప్ వేసుకొని వచ్చేయడానికి ఇది జబర్దస్త్ షో కాదు అంటూ ఘాటైన విమర్శలు చేశారు. స్క్రిప్ట్ లో డైలాగులతో ఉతికేయడానికి ఇది బతుకు జట్కా బండి షో కాదు. దొంగ పెట్టిన దొంగ ఛానల్ సాక్షి వాళ్ళ స్క్రిప్టు పట్టుకుని వస్తే ఇలాగే అడ్డంగా బుక్ అయిపోతావ్ అంటూ విమర్శించారు.

రాసిన వాడు అంటే జగన్ రెడ్డి లాగే పదవ తరగతి పేపర్లు ఎత్తుకెళ్లి పాస్ అయినవాడు అనుకుందాం. చదివే యాంకరమ్మకి  మతి ఉండాలి కదా అన్నారు. విశాఖ జిల్లాలో తాళ్లవలస అయితే శ్రీకాకుళం జిల్లా తాళ్లవలస అంటోంది. జై బాబు అని జనం అంటుంటే.. జై జగన్ అన్నారని కోడి కత్తి కథలు చెబుతోంది. అమీర్ పెట్ ఎడిటింగ్లు.. మార్కాపురం మార్పింగులతో ఇంకెన్నాళ్లీ “జగన్నాటకం” అంటూ ఆయన నేటి ఉదయం వరుస ట్వీట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version