సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఖరారు చేసిన తెలంగాణ సర్కార్

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా వచ్చే సంవత్సరం జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిలు రూపొందిస్తోంది.

ఈ మేరకు ఇప్పటికే సన్న బయ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్‌, మిల్లింగ్‌పై అధికారుల దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ సెంటర్లకు సన్న బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే.రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యాన్న సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా వారి కోసం ప్రతి నెల 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తున్నారు. ఏడాదికి 21 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మంది ఈ పథకం ద్వారా లాభం చేకూరనుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పీడీఎస్‌ ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టుబోతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news