దారుణం: నడిరోడ్డుపై యువతిని నరికి చంపిన వ్యక్తి

-

ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. అందుకు ఆ యువతి నో చెప్పింది. దానిని ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. అయితే ఆ యువతి వేరే అబ్బాయితో చనువుగా ఉంటుందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. నడిరోడ్డుపై దారుణంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జైపూర్‌లో చేసుకుంది. జైపూర్ కి చెందిన ఓ యువతి పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో దారుణంగా పొడిచాడు. అక్కడితో అతడి కోపం పోలేదు.

కాస్త దూరం వెళ్లి పిస్టల్ తో షూట్ చేశాడు. ఈ విషయం చూసి అంతా షాకయ్యారు. అనంతరం తేరుకుని ఆమెను రక్షించేందుకు కొందరు ప్రయత్నించారు. ఇద్దరు వ్యక్తులు యువతిని మధ్యలో ఉంచి వ్యక్తులు స్కూటిపై ఆస్పత్రికి తరలించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు.. ఆమె అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యలు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయికి మధ్య ఏమైనా పరిచయం ఉందా లేక, అమ్మాయి తనకు దక్కదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news