Suryapet: పైసల కోసం కక్కుర్తి పడి ఆవుల ప్రాణాలు తీసిన పోలీసులు

-

పైసల కోసం కక్కుర్తి పడి ఆవుల ప్రాణాలు తీశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మట్టపల్లిలో కంటైనర్లో గోవులను తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. ఆవులు పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆవులుగా గుర్తించారు. కంటైనర్లో మొత్తం 26 ఆవులు ఉండగా ఊపిరాడక 15 ఆవులు మృత్యువాత పడ్డాయి. తొమ్మిది ఆవులు నల్గొండ గోశాలకు తరలించారు.

The policemen who killed cows for money

రెండు ఆవులు కాలు విరిగి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. నిన్న ఉదయం మట్టపల్లి చెక్పోస్ట్ వద్ద 10 గంటలకు పట్టుకున్న పోలీసులు. సెటిల్మెంట్ చేసుకునే క్రమంలో పోలీసులు. సెటిల్మెంట్ కుదరక ఉన్నతాధికారికి తెలియడంతో రాత్రి 8 గంటలకు ఎఫ్ఐఆర్ చేశారు స్థానిక ఎస్సై రామాంజనేయులు. మఠంపల్లి పోలీసులపై విచారణ కు ఆదేశించారు ఎస్పీ రాహుల్ హెగ్డే. ఎస్ఐ రామాంజనేయులు నిర్లక్ష్యం వల్లనే 16 ఆవులు చనిపోయాయని సర్వత్ర విమర్శలు వెల్వెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news