ధోనీసేన తో పోరు.. ఆ ఆటగాన్ని రంగంలోకి దింపిన కోహ్లీ..?

-

ఐపీఎల్ 2020 సీజన్లో మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్ పై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎవరు పైచేయి సాధించి విజయం సాధిస్తారు అన్నది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడినప్పుడు గత రికార్డులను చూసుకుంటే చెన్నై జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఈసారి చెన్నై జట్టు కూడా అంతగా బలంగా లేదు అన్న విషయం తెలిసిందే.

ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి గాయం కారణంగా బెంగళూరు జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్లో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది బెంగళూరు జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెంగళూరు జట్టు లో మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నేడు సాయంత్రం జరగబోయే మ్యాచ్ లో మళ్లీ చెన్నై జట్టు విజయం సాధిస్తుందా లేక ఆర్సిబి సత్తా చాటుతుందా అన్నది చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news