ఆధార్ లేదని మహిళకు వైద్యం చేయకుండా గెంటేసిన ఉస్మానియా సిబ్బంది

-

ఆధార్ కార్డు లేదని ఆస్పత్రిలో వైద్యం అందించకుండా మహిళను గెంటేసిన ఘటన ఉస్మానియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. మహబూబ్ నగర్ జిల్లా మారేడుపల్లికి చెందిన ప్రమీల భర్త సురేష్ ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించాడు. భర్త మృతి చెందిన నెల రోజులకే కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

అయితే, తీవ్ర అనారోగ్యానికి గురైన ప్రమీల తన ఆరేళ్ల కూతురితో హైదరాబాద్ వచ్చింది. అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉస్మానియాకు వెళ్లగా ఆధార్ కార్డు లేదని వైద్యం చేయడానికి సిబ్బంది నిరాకరించినట్లు తెలిసింది.దీంతో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆసుపత్రి బయట దయనీయ స్థితిలో ప్రమీల పడుకొని ఉన్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏం చేయాలో తెలియని చిన్నారి అనూష.. తల్లిని ఒడిలో పడుకోపెట్టుకుని సాయం చేసే వారికోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version