నూజివీడులో దారుణం..ఓ యువతిని సమాధుల దగ్గరకు లాక్కెళ్లిన మైనర్లు !

-

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో దారుణం జరిగింది. ఓ ప్రముఖ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థిని(16) ని రాత్రివేళ పట్టణంలోని అజరయ్యపేట సమాధుల వద్దకు లాక్కు వెళ్లారు మైనర్ బాలురులు. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకుల వద్ద నుంచి పెనుగులాడి చాలా చాక చక్యంతో తప్పించుకుంది బాలిక.

The atrocity took place in Nujiveedu town of Eluru district

ఓ ప్రముఖ కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న బాలిక బ్యాగును వేరొకరికి అందించి బలవంతంగా తీసుకువెళ్లారు బాలురు. ఇక ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు… ఇద్దరు యువకులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతే కాదు… ఫో క్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన బయటకు రావడంతో… ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో అమ్మాయిలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version