మళ్ళీ ఏపీ పోలీసులు ఇరుక్కుపోయారా…?

-

రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో నిందితులు నుంచి బాధితులకు బెదిరింపులు వచ్చాయి. కేసు ఉపసంహరించుకోవాలని వేధించడంతో భయపడి రాజమండ్రి- ఎస్పీ ఆఫీసు ఎదుట తండ్రి షేక్ సత్తార్ ఈ నెల 1న ఆత్మహత్యయత్నం చేసాడు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నిజనిర్ధారణకు తెలుగుదేశం పార్టీ కమిటీ నియామకం జరిగింది.

టీడీపీ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ రాజమండ్రి చేరుకుంది. నాగుల్ మీరా , మహ్మద్ నసీర్, ఎం.డి.హిదాయత్, మహమ్మద్ నజీర్ లతో తెలుగుదేశం బృందం ఏర్పాటు చేసారు. బొమ్మూరులో బాధిత కుటుంబాన్ని పరామర్శించి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన టీడీపీ బృందం… బాధితురాలి తండ్రిని కలిసే అవకాశం ఉంది. పోలీసులపై టీడీపీ ఆరోపణలు చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version