ముగిసిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం మొదలైన క్యాబినెట్ భేటీ దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది.

ఈసీ కేబినెట్ భేటీకి అంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో కేవలం అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై మాత్రమే చర్చించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడంతో పాటు ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.ధాన్యం కొనుగోళ్లపై డిస్కస్ చేసిన కేబినెట్.. వరి కొనుగోళ్ల బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేసింది.

 

ఏ రైతుకు నష్టం జరగకుండా చివరి గింజ వరకు కొనాలని అధికారులకు జారీ చేశారు. ఇక, లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ, రాష్ట్ర విజభన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో.. దీనిపై డిస్కషన్ జరగలేదు.

Read more RELATED
Recommended to you

Latest news