ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పై తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 26న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మే 26న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమీక్ష సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ మే 26వ తేదీన ఐఎస్బి లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారని, ఎం.ఎస్.జి తో సమన్వయంతో వివిధ శాఖలు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version