బ్రేకింగ్: బ్లాక్ ఫంగస్ పై తెలంగాణా కీలక నిర్ణయం

-

కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేస్ లలో బ్లాక్ ఫంగస్ సమస్య అని తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించారు. బ్లాక్ ఫంగస్ భారిన పడితున్న వారిలో ఎక్కువగా ఈఎన్ టి సమస్యలు వస్తున్నాయని, బ్లాక్ ఫంగస్ కేస్ ల చికిత్సకు నోడల్ కేంద్రం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ ఎన్ టి ఆసుపత్రిని నోడల్ కేంద్రం గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫంగస్ బారిన పడి కరోనా ఉంటే గాంధీ లో చికిత్స చేస్తారు.

బ్లాక్ ఫంగస్ భారిన పడి ఆప్తల్మాలజీ వైద్యుడి అసవరం ఉంటే సరోజిని దేవి ఆసుపత్రి సేవలు వినియోగించనున్నట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. ఈ మేరకు గాంధీ , సరోజిని దేవి, కోటి ఈ ఎన్ టి ఆస్పత్రుల సుపరిండెంట్ లు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసారు. బ్లాక్ ఫంగస్ కేస్ లు పూర్తిగా కోటి ఈ ఎం టి లో చికిత్స చేస్తారు. కరోనా తో ఉండి బ్లాక్ ఫంగస్ సమస్య ఉంటే గదిలో వైద్యం చేస్తారు. బ్లాక్ ఫంగస్ కి వినియోగించే మందులు సమకూర్చలని టిఎస్ఎంఐడిసికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version