భార్యతో గొడవ పడి పడుకుంటే… డజన్ సార్లు పొడిచి చంపిన భార్య

-

ఢిల్లీలో ఛత్తర్‌పూర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో జరిగిన ఒక ఘటన సంచలనంగా మారింది. భార్య తన భర్తను… కత్తితో డజన్ సార్లు పొడిచి చంపింది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మెహ్రౌలి పోలీస్ స్టేషన్ కు పరిధిలోని ఎఎస్ఐ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని పెట్రోలింగ్ బృందం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. నివాసానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టిన తరువాత, పోలీసు సిబ్బంది అపస్మారక స్థితిలో ఉన్న భర్త, భార్యను కనుగొన్నారు.

నేల మీద గది గోడల మీద రక్తం మరకలు ఉన్నాయి. అంబులెన్స్‌ను పిలిపించి, దంపతులను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ భర్త చనిపోయినట్లు ప్రకటించారు. ఆయన మరణానికి సంబంధించి భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. భర్త చిరాగ్ శర్మ (37) హర్యానాకు చెందిన యమునా నగర్ నివాసి కాగా, అతని భార్య రేణుక (36) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందినవారని డిసిపి అతుల్ కుమార్ తెలిపారు.

ఇద్దరూ ఒకే భీమా సంస్థలో వివిధ విభాగాలలో పనిచేశారు. 2013 లో వారికి ప్రేమ వివాహం తరువాత ఛత్తర్పూర్ ఎక్స్‌టెన్షన్‌ లోని ఇంటికి వెళ్లారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. ఈ సమస్యపై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఆదివారం, ఈ జంట అలాగే గొడవ పడగా… ఆ తరువాత భర్త తన గదిలో నిద్రపోయాడు. కోపంతో భార్య అతన్ని డజనుకు పైగా సార్లు పొడిచి చంపడానికి వంటగదిలో కత్తిని ఉపయోగించినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఆమె కూడా ఆ తర్వాత కత్తితో పొడుచుకుంది . ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news