షాకింగ్: ఆవుదూడ గురించి అయిదుగురు చచ్చిపోయారు…!

-

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పురాతనమైన పాడుబడిన బావిలో పడిపోయిన ఆవుదూడను కాపాడే క్రమంలో అయిదుగురు ప్రాణాలు విడిచారు. ఉత్తరప్రదేశ్‌లో గోండా జిల్లాలోని రాజా మొహల్లా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఒక ఆవుదూడ స్థానికులు చెత్త వేసే ఒక పాడుబడ్డ బావిలో పడింది. దానిని ఒక వ్యక్తి గమనించి కాపాడటానికి ముందుకొచ్చారు.

ఈ క్రమంలో సదరు ఆవు దూడను రక్షించేందుకు నిచ్చెన సాయంతో ఒక వ్యక్తి బావిలోకి దిగి… అందులో నుంచి వస్తున్న విష వాయువుని పీల్చి స్పృహ కోల్పోయాడు. అతనిని బయటకు తీయడానికి మరో నలుగురు లోపలి దిగారు. దీనితో వారు కూడా స్పృహ కోల్పోయారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం పంపగా వారు వచ్చి బయటకు తీయగా అందరూ మరణించారు. విష వాయువు కారణంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని పోస్ట్ మార్టంలో వైద్యులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version