వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడిపోతున్నారు : మల్లాడి విష్ణు

-

పెన్షన్ పంపిణీపై తెలుగుదేశం పార్టీ చెడు ప్రచారాన్ని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. వాలంటీర్ వ్యవస్థను చూసి టీడీపీ నేతలు భయపడిపోతున్నారని విమర్శించారు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ తరపున ఆరుగురు మాట్లాడారని ఆయన పేర్కొన్నారు.పెన్షన్ ఆపింది మీరే.. ఇవ్వాలని గొడవలు చేసేది మీరే అంటూ ఆయన మండిపడ్డారు.

దేవినేని ఉమ ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు నాయుడు 50 రూపాయలు ఇచ్చారని.. రాజశేఖర్ రెడ్డి హయాంలో 200 చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమ అబద్ధాలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబు 66 లక్షల పెన్షనర్ల ఓటు వల్ల ఓడిపోవడం ఖాయమని తెలిపారు. ప్రజలకు, పెన్షనర్లు, సచివాలయం సిబ్బందికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని , 66 లక్షల మంది పెన్షన్ ప్రతీనెల 1న ఇంటి వద్దకే ఇవ్వాలనే మార్గాన్ని జగన్ ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version