చిరు, పవన్ లను వెన్నుపోటు పొడించింది వాళ్ళే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్ వైరల్..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న హీరోలలో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఎప్పుడూ మొదటి వరసలో ఉంటారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వీరిద్దరిని వెన్నుపోటు పొడిచారు అంటూ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను బయటపెట్టారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ .. పవన్ ను హైపర్ ఆది దేవుడిలా భావిస్తాడు కాబట్టి హైపర్ ఆది రోజా పై విమర్శలు చేశారు. ఎవరి పార్టీని వాళ్లు కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అంటూ నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

మరోవైపు చిరంజీవి గురించి మాట్లాడుతూ… చిరంజీవి వల్ల లబ్ధి పొందిన వాళ్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా అవకాశాల కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల కాళ్లు పట్టుకొని ఇప్పుడు ఉన్నత స్థానానికి చేరుకున్న వాళ్లు కూడా ఇప్పుడు వారిపై సెటైర్లు వేస్తున్నారు అంటూ నట్టి కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా ఇప్పుడు వాళ్లే పవన్ పై పోటీ చేస్తానని కామెంట్లో చేయడం ఏమన్నా సబబుగా ఉంది అంటూ ఆలీపై పరోక్షంగా సెటైర్ లు వేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కొంతమంది నటులు పవన్ కళ్యాణ్, చిరంజీవి లను వెన్నుపోటు పొడిచారు అంటూ నట్టి కుమార్ పరోక్షంగా కామెంట్లు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

జనసేన పార్టీ సభలో హైపర్ ఆది అవతలి వాళ్లు మాట్లాడిన వ్యాఖ్యలకు మాత్రమే కౌంటర్లు ఇచ్చాడు. నాగబాబు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరు ఎవరిని బెదిరించరని తెలిపిన నట్టి కుమార్ పొలిటికల్ గా తిట్టుకోవడం తప్పు కాదు అని.. కానీ కుటుంబాల జోలికి వస్తే మాత్రం తన దృష్టిలో కరెక్ట్ కాదని.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి అయితే రోజా, అలీపై సెటైరికల్ కామెంట్లు చేస్తూ పరోక్షంగా వారు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను వెన్నుపోటు పొడుస్తున్నారు అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version