ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై ఐపీఎల్ చైర్మన్ స్పందన ఇదే !

-

గత సీజన్ నుంచి ఐపీఎల్‌లో అమలు చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రాలాంటి స్టార్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ రూల్ వల్ల ఆల్‌రౌండర్లకు నష్టం జరుగుతుందని రోహిత్ శర్మ వ్యాఖ్యానించగా.. గేమ్ సమతుల్యత దెబ్బతింటుందని విరాట్ కోహ్లీ తెలిపారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై విమర్శల నేపథ్యంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. తాజాగా జాతీయ మీడియాతో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ఆల్‌రౌండర్లను తయారు చేసే బాధ్యత కేవలం ఐపీఎల్‌పైనే ఉందా? అని ప్రశ్నించారు. ‘బీసీసీఐ ఏడాదికి 2 వేలకుపైగా మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. ఆటగాళ్లు అందులో ప్రతిభ చాటే అవకాశాలను పొందుతున్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ,అండర్-16, అండర్-19 ఇలా చాలా టోర్నీలు ఉన్నాయి.’అని అన్నారు .ఈ రూల్ కొనసాగించాలా?లేదా? అనే విషయంపై వాటాదారులతో మాట్లాడుతామని, టోర్నమెంట్‌కు ఏది మంచిదో అదే చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news