బుల్లితెర నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాసిందంటే!

-

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి రష్మి రేఖ ఓజా జూన్ 18వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. కెమిటీ కహిబి కహా అనే ఒడియా సీరియల్‌లో నటించిన ఈమె మంచి గుర్తింపు పొందింది. భువనేశ్వర్ సమీపంలోని నాయపల్లిలో తాను అద్దెకు ఉంటోంది. ఆ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత కొద్దిరోజులుగా సంతోష్ అనే వ్యక్తితో కలిసి అద్దింట్లో ఉంటున్నట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

నటి రష్మి రేఖ
నటి రష్మి రేఖ

నటి రష్మి (23 ఏళ్లు) ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సూసైడ్ నోట్‌లో తన మరణానికి ఎవరూ కారణం కాదని రాసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తన కుమార్తె మృతి చెందిన విషయం సంతోష్ చెప్పాడని, సంతోష్-రష్మి ఇద్దరూ వివాహం చేసుకున్న విషయం ఇంటి యజమాని చెప్పేవరకు తనకు తెలియదని రష్మి తండ్రి తెలిపారు. సంతోష్ వల్లే తన కూతురు మరణించి ఉండవచ్చని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news