రైతులకు గుడ్ న్యూస్.. ఈసారి ముందుగానే వచ్చేసిన రుతుపవనాలు

-

భారత రైతులకు వాతావరణ శాఖ శుభవార్త అందించింది. ఈ రోజు ఉదయం నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకినట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ప్రతి సంవత్సరం ఈ రుతుపవనాలు మే 18 నుంచి 20 తేదీల మధ్యలో అండమాన్ తీరాన్ని తాకుతాయి.. ఇందులో బాగంగానే ఒక రోజు ముందుగా.. వచ్చాయని.. ఈసారి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయని.. వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్, మాల్దీవులు, కొమోరియన్ లోని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించి ఉన్నాయని.. మే 31న కేరళ, తీరానికి చేరుకుంటాయని.. జూన్ మొదటి వారంలో రాయలసీమకు ఆ తర్వాత వారంలో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు మొత్తం ఈ వర్షపాతం మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. ఈ నైరుతి రుతుపవనాల సమయంలో కురిసిన వర్షాల ఆధారంగానే పత్తి, వరి వంటి కీలక పంటలు సాగు చేస్తారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం అనుకున్న సమయానికి వర్గాలు వస్తుండటంతో రైతులు ఆనందంలో ఉన్నారు. అలాగే వ్యవసాయం ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకుంటున్నారు. కాగా ఈ సారి వర్షపాతం సాధారణం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version