జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ప్రాణాలకు ముప్పు.. నిఘా వర్గాలు వెల్లడి

-

వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడు, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ప్రాణాలను ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయన భద్రతను జెడ్​ నుంచి జెడ్​ ప్లస్​కు మార్చింది.

Babri masid
Babri masid

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయనకు జెడ్​ ప్లస్​ భద్రతను కల్పించింది.వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో.. 64 ఏళ్ల సీజేఐ జస్టిస్​ బోబ్డే ఒకరు.ఇప్పటివరకు భారత ప్రధాన న్యాయమూర్తికి జెడ్​ కేటగిరీ భద్రత ఉండేది. దానిని జెడ్​ ప్లస్​ కేటగిరికి మార్చుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. జస్టిస్​ బోబ్డే సీఆర్​పీఎఫ్​, సీఏపీఎఫ్​ బలగాలు భద్రతలో ఉండనున్నారు.భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే 2019 నవంబర్​ 18న బాధ్యతలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news