త్వ‌ర‌లో మూడు రాజ‌ధానుల బిల్లు.. మంత్రి కొడాలి నాని సంచ‌ల‌నం

-

ఆంధ్ర ప్ర‌దేశ్ మూడు రాజ‌ధానుల అంశం పై మంత్రి కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అతి త్వ‌ర‌లోనే మూడు రాజ‌ధానుల బిల్లును తీసుకువ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు. బిల్లు పెట్ట‌డ‌మే కాకుండా దానిని ఆమోదిస్తామ‌ని కూడా స్ప‌ష్టం చేశారు. ఒక రాజ‌ధానితో ఒక చోటే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని అన్నారు. అదే మూడు రాజ‌ధానులు ఉంటే మూడు ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రిక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని అన్నారు. అలాగే మూడు రాజ‌ధానులు ఉంటే.. ప‌రిపాల‌న సౌల‌భ్యం కూడా ఉంటుంద‌ని తెలిపారు.

రాజ‌ధాని అంశం పై టీడీపీ నాయ‌కులు కోడి గుడ్డు మీద ఈక‌లు పీకుతున్నార‌ని విమ‌ర్శించారు. మూడు రాజ‌ధానుల బిల్లును ఎవ‌రూ అడ్డుకోలేర‌ని తెల్చి చెప్పారు. అలాగే ఎమ్మెల్సీ అశోక్ బాబు దొంగ స‌ర్టిఫికేట్స్ ను సృష్టించార‌ని అన్నారు. అందుకే అత‌న్ని పోలీసులు అరెస్టు చేశార‌ని తెలిపారు. అలాంటి దొంగ స‌ర్టిఫికేట్ తో అశోక్ బాబు ప్ర‌మోషన్స్ పొందాడ‌ని అన్నారు. అలాంటి నీచుడికి టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌ట్టం ముందు దొంగ సర్టిఫికేట్ల అశోక్ బాబు అయినా.. చంద్ర బాబు అయినా స‌మాన‌మే అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news