కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు

-

ఖమ్మం జిల్లాలోని పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. కనీసం తనతో చర్చలు జరిపి వేరే పదవి ఏదైనా ఇస్తారని ఆశించినా.. అక్కడ కూడా భంగపాటు తప్పలేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ తీరుపై మండిపాటుకు గురైన తుమ్మల తాను పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించి తమ పార్టీలోకి ఆహ్వానించింది.

దీంతో ఇవాళ ఉదయం బీఆర్ఎస్ పార్టీరి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​కు పంపించారు. అనంతరం హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల వేదికగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తుమ్మల నాగేశ్వరావు. ఈ సందర్భంగా తుమ్మలకు పార్టీ కండువా కప్పి ఖర్గే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తన నిర్ణయం ఏదైనా.. ఎల్లప్పుడూ తన వెంటనే ఉన్న అనుచరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు తుమ్మల నాగేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Latest news