వైసీపీ వద్దనుకుంటే మీ పీక మీరు కోసుకోవడమే.. మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు

-

శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి. వైసీపీని వ్యతిరేకించడం అంటే గొప్ప అనుకోకండి. వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే మీ పీక మీరు కోసుకోవడమే, మీ చేతిని మీరు నరుక్కోవడమే అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఓడిపోతే ఆడవాళ్లకి ఎంత చేశాడు.

ఆడోళ్లు ఆడోళ్లు అనుకొని చచ్చాడురా అంటారు. తరువాత వచ్చిన ప్రభుత్వం ఆడవాళ్లని పట్టించుకోదన్నారు. సమాజంలో మహిళలకు ఇంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వాన్ని వద్దనుకుంటే ఏం చేయాలి అని ప్రశ్నించారు. నూనె, గ్యాస్, కరెంట్ పెరిగాయి అని మాట్లాడుతున్నారు. దేశం మొత్తం పెరిగాయి. మనవద్దనే కాదని.. దేశం మొత్తం పెరిగినట్టు తెలిపారు. ధరలు పెరిగినా తట్టుకునేలా మీ అకౌంట్స్ లో డబ్బు జమచేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల్లో ఇలా జరుగలేదు కదా అని ప్రశ్నించారు. మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి ధర్మాన.

Read more RELATED
Recommended to you

Latest news