తిరుమలను యూటీగా ప్రకటించాలి : కే. ఏ. పాల్

-

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజుల నుంచి తిరుమల లడ్డు, ప్రసాదం వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం పై కే.ఏ.పాల్ స్పందించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి వివాదం పై నేను వేసిన పిటిషన్ లిస్ట్ అయిందని.. నేను వేసిన పిటీషన్ అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టును కోరాను. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దు అన్నారు.

తిరుమల తిరుపతిని యూటీగా చేయాలని పిటిషన్ లో నా ప్రేయర్ అని తెలిపారు కే.ఏ.పాల్. లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు డ్రామాలు క్రియేట్ చేశాడు.  ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబును సస్పెండ్ చేయాలన్నారు. మోడీని చంద్రబాబు టెర్రరిస్ట్ అన్నారు. సిట్ ను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ డ్రామాలు మానేయాలి.  తక్షణమే క్షమాపణలు చెప్పాలి. చంద్రబాబు మారు మనసు పొందాలని పవన్ కళ్యాణ్ దీక్ష చేయాలని కే.ఏ.పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version