Tirupati : స్వామివారిని దర్శించుకున్న గోల్డ్ మ్యాన్..!

-

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు గడ్డిపాటి సాంబశివరావు దర్శించుకున్నారు. సాధారణంగా అయితే ఇతని గురించి ఎవరూ పట్టించుకునేవారు కాకపోవచ్చు.అయితే మంగళగిరికి చెందిన గడ్డిపాటి సాంబశివరావు మూడు కిలోల బంగారు అభరణాలు ధరించి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నాడు.

దీంతో ఈ వ్యక్తి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తజనాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు. అతను ధరించిన అభరణాలు చూసిన భక్తులు ఆకర్షితులు అయ్యారు.భక్తులందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సదరు గోల్డ్ మ్యాన్గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వాసి.చేతులకు కంకణాలు బరువైన ఉంగరాలు మెడలో కంఠాభరణం వేసుకొని వచ్చిన సాంబశివరావుతో సెల్ఫీలు దిగడానికి చాలామంది జనం ఎగబడ్డారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

 

Read more RELATED
Recommended to you

Latest news