సీఎం చంద్రబాబు బొమ్మ గీసిన టాలీవుడ్ హీరో.. ఫొటో వైరల్..!

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్లు.. 2014లో ఐదేళ్లు మొత్తం 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేశారు. మళ్లీ ప్రస్తుతం మరో ఐదేళ్లపాటు సీఎంగా ఉండనున్నారు చంద్రబాబు. చంద్రబాబుకు పలువురు సినీ ప్రముఖులు చాలా మందితో మంచి సాన్నిహిత్యం ఉంది. తాజాగా చంద్రబాబును టాలీవుడ్ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు హీరో మంచు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ నేపథ్యంలో వరద బాధితులకు సీఎం సహాయనిధి కింద విరాళంగా రూ.25లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు మోహన్ బాబు, విష్ణు. సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు పోస్ట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ సీఎం ను కలిసే భాగ్యం దక్కింది. చంద్ర బాబు నాయుడు గారికి రూ. 25 లక్షల చెక్కును ఏపీ వరద బాధితుల  సహాయ నిధికి అందించాం. అదేవిధంగా కన్నప్ప గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. నా ఆర్ట్‌వర్క్‌పై ఆయన ఆటోగ్రాఫ్  కూడా ఇచ్చారు.  అతనికి మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను” అని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version