విశాఖలో బైక్ ను ఢీకొట్టిన ట్రాక్టర్.. ముగ్గురు యువకులు దుర్మరణం

-

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. అసలేం జరిగిందంటే..?

విశాఖ జిల్లాలోని వెంకోజిపాలెం జంక్షన్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో  మద్దిలపాలెం వైపు వస్తున్న బైక్‌ను ట్రాక్టర్​ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మృతులు ఎండాడకు చెందిన సాయి, దుర్గాప్రసాద్, గోపిలుగా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news