హైదాబాద్‌వాసులకు అలర్ట్‌.. నేడు ఆ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

-

నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు భాగ్యనగర వాసులకు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు నగరానికి రానున్నారు. ఉదయం 9.35 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.29లోని ఆయన నివాసానికి చేరుకుంటారు.

ఈ నేపథ్యంలో పీఎన్‌టీ ఫ్లైఓవర్‌, శ్యామ్‌లాల్‌ బిల్డింగ్‌, హెచ్‌పీఎస్‌ బేగంపేట్‌, బేగంపేట్‌ ఫ్లైఓవర్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం. 29 మార్గంలో ట్రాఫిక్‌ నిలిపివేత, మళ్లింపులు ఉంటాయని చెప్పారు. దీంతో ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా భారీ వాహనాలను నగరంలోకి అనుమతించబోని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version